విజయసాయి వాయిస్....!

Update: 2018-07-24 11:15 GMT

ఆంధ్ర ప్రదేశ్ కు సంజీవని లాంటి ప్రత్యేక హోదాను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీ విభజన చట్టంపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో వైసీపీ తరుపున విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి కానీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుందని, ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని, మొదటి నుంచీ ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని తమ పార్టీ నమ్ముతుందని, కానీ టీడీపీ మాత్రం సంజీవని కాదని అన్నదని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వకపోవడంలో మొదటి ముద్దాయి బీజేపీ అయితే, రెండో ముద్దాయి టీడీపీ అని, మూడో ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.

Similar News