ఎల్లోమీడియాకు చిక్కొచ్చిపడింది

ఎల్లోమీడియాకు పెద్ద చిక్కొచ్చిపడిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్లో స్పందించారు. చంద్రబాబునాయుడు బీజేపీని వీడినప్పుడు ఎల్లోమీడియా మోదీని విలన్ గా చిత్రీకరించిందన్నారు. ఇప్పుడు [more]

Update: 2019-08-19 07:20 GMT

ఎల్లోమీడియాకు పెద్ద చిక్కొచ్చిపడిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్లో స్పందించారు. చంద్రబాబునాయుడు బీజేపీని వీడినప్పుడు ఎల్లోమీడియా మోదీని విలన్ గా చిత్రీకరించిందన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలందరూ బీజేపీలోకి జంప్ చేస్తుంటే ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. గతంలో వరదలు వచ్చినన్పుడు చంద్రబాబు వన్ మ్యాన్ షో నడిచేదన్నారు. కానీ ఇప్పుడు మంత్రులు, అధికారులు కలసి సమన్వయంతో వరద బాధితులును ఆదుకుంటున్నారన్నారు. పబ్లిసిటీ కంటే పని ముఖ్యమన్నది వైసీపీ నేతల ఉద్దేశ్యమని తెలిపారు. వరద నీటిలో మునిగిపోయిన చంద్రబాబు నివాసాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తే అది హత్యకు కుట్ర చేసినట్లా? అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News