గెలిచే సీన్ ఉంటే నాలుగు స‌ర్వేలు ఎందుకు..?

తెలుగుదేశం పార్టీ గెలిచే సీన్ ఉంటే నాలుగు స‌ర్వేలు ఎందుకు చేయించుకున్నార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ లో ప‌లు [more]

Update: 2019-05-14 08:00 GMT

తెలుగుదేశం పార్టీ గెలిచే సీన్ ఉంటే నాలుగు స‌ర్వేలు ఎందుకు చేయించుకున్నార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ లో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు త‌న స‌ర్వే వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టి క‌నీసం కౌంటింగ్ ఏజెంట్ల‌కైనా ధైర్యం ఇవ్వాల‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌లు ఐదేళ్ల‌కోసారి వ‌స్తాయ‌ని, పార్టీ మాత్రం శాశ్వ‌తమ‌న్నారు. మేలో రావాల్సిన ఎన్నిల‌ను ముందే జ‌రిపి ఇబ్బంది పెట్టాల‌ని చూశార‌ని ఎందుకు శోకాలు పెడుతున్నార‌ని అడిగారు. కేసీఆర్ స్టాలిన్ ను క‌లిసి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి చ‌ర్చించినందున చంద్రం సారుకు నిద్ర ప‌ట్ట‌ద‌ని, స్టాలిన్ ను త‌నూ క‌లిసి అటువంటిదేమీ లేద‌ను అని ప్ర‌క‌టించేదాకా ఊరుకోడ‌న్నారు. 2 ఎంపీ సీట్లు కూడా క‌ష్ట‌మేన‌ని తెలిశాక ఎవ‌ర‌రు లెక్క చేస్తార‌ని పేర్కొన్నారు.

Tags:    

Similar News