పది నిమిషాల్లోనే పచ్చ కమిటీ ఎందుకో?

అంతర్వేది ఘటనను టీడీపీ రాజకీయం చేస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో పది మంది చనిపోతే నోరు మెదపని చంద్రబాబు అంతర్వేది ఘటనపై [more]

Update: 2020-09-08 08:19 GMT

అంతర్వేది ఘటనను టీడీపీ రాజకీయం చేస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో పది మంది చనిపోతే నోరు మెదపని చంద్రబాబు అంతర్వేది ఘటనపై పది నిమిషాల్లోనే నిజనిర్ధారణ కమిటీ వేశారన్నారు. రమేష్ ఆసుపత్రిపై ఈగ కూడా వాలనివ్వకుండా చంద్రబాబు అన్ని రకాలుగా కాపాడుతున్నారన్నారు. ఇప్పుడు అంతర్వేదిలో జరిగిన ఘటనను టీడీపీ రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తుందని, దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని విజయసాయిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News