పాదయాత్రను కూడా రాజకీయం చేయొద్దు

రాజకీయ విమర్శలకు నేను భయపడే ప్రసక్తిలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించారు. తమ పార్టీ విశాఖ స్టీల్ [more]

Update: 2021-02-20 03:50 GMT

రాజకీయ విమర్శలకు నేను భయపడే ప్రసక్తిలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించారు. తమ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు వ్యతిరేకమన్నారు. పార్లమెంటు బయటా, లోపలా తాము వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. ఢిల్లీలోనూ, విశాఖలోనూ తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇక్కడ పాదయాత్ర చేసినందువల్ల ప్రయోజనం ఏంటని కొందరు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారని, వారిపై విమర్శలు చేయబోనని, వారి విజ్ఞతకే వదిలేస్తానన్నారు. అన్ని పార్టీలు కలసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాలన్నారు. మొత్తం 23 కిలోమీటర్ల మేరకు విజయసాయిరెడ్డి పాదయాత్ర సాగనుంది. అనంతరం స్టీల్ ప్లాంట్ గేటు వద్ద బహిరంగ సభను నిర్వహించనున్నారు.

Tags:    

Similar News