బ్రేకింగ్ : నేను మళ్లీ చెబుతున్నా 20 కోట్లకు అమ్ముడుపోయారు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మరోసారి విమర్శలకు దిగారు. తాను మళ్లీ చెబుతున్నానని కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు టీడీపీకి అమ్ముడుపోయారన్నారు. [more]

Update: 2020-04-21 06:17 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మరోసారి విమర్శలకు దిగారు. తాను మళ్లీ చెబుతున్నానని కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు టీడీపీకి అమ్ముడుపోయారన్నారు. కన్నా లక్ష్మీనారాయణ అవినీతిపరుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణకు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. సుజనా చౌదరి వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులకు ఎగ్గొట్టారన్నారు. సుజనా, కన్నా తాము అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. తాను కాణిపాకమే కాదు తిరుమల వెంకటేశ్వరుడి సాక్షిగా కూడా ప్రమాణం చేస్తానని తెలిపారు. తాను ఏనాడూ అవిీనతికి పాల్పడలేదని తెలిపారు.

Tags:    

Similar News