ఓటర్లకు కాదు.. నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పండి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ప్రజలను ఓటు అడిగే ముందు టీడీపీ నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెెప్పాలని [more]

Update: 2021-03-07 02:32 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ప్రజలను ఓటు అడిగే ముందు టీడీపీ నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెెప్పాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు విజయవాడలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదన్నారు. విజయవాడ కోసం అధికారంలో ఉండగా ఒక్కరూపాయి కూడా కేటాయించలేదని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని వెల్లంపల్లి జోస్యం చెప్పారు. చంద్రబాబు ఒక కులానికి చెందిన నేతగానే మిగిలిపోయారు.

Tags:    

Similar News