వైసీపీ అభ్య‌ర్థికి స‌న్మానం చేస్తా

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థుల మ‌ధ్య వివాదం ఇంకా చ‌ల్లార‌డం లేదు. టీడీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట్రావును టార్గెట్ [more]

Update: 2019-05-16 12:38 GMT

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థుల మ‌ధ్య వివాదం ఇంకా చ‌ల్లార‌డం లేదు. టీడీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట్రావును టార్గెట్ చేశారు. వైసీపీ అభ్య‌ర్థి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు స‌న్మానం చేస్తాన‌ని చెప్పిన మాట‌కు తాను ఇంకా క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. యార్ల‌గ‌డ్డ‌కు తాను ఫోన్ చేస్తున్నాన‌ని, ఆయ‌న లిఫ్ట్ చేయ‌డం లేద‌ని తెలిపారు. ప్ర‌జాస్వామ్యంలో త‌న‌కు ఎవ‌రినైనా క‌లిసే హ‌క్కు ఉంద‌ని వాద‌న‌కు దిగారు. వెంక‌ట్రావుతో పాటు వైసీపీ నేత‌లు దాస‌రి బ్ర‌ద‌ర్స్ ఎక్క‌డ కనిపించినా స‌న్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఇటీవ‌ల ఆయ‌న యార్ల‌గ‌డ్డ‌కు స‌న్మానం చేస్తానంటూ ఫోన్ చేయ‌డం, ఇంటికి వెళ్లడం తెలిసిన విష‌య‌మే. వ‌ల్ల‌భ‌నేని వంశీ బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని యార్ల‌గ‌డ్డ ఆరోపించారు.

Tags:    

Similar News