పోల‌వ‌రంపై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

పోల‌వ‌రం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ… పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో దారుణాలు జ‌రుగుతున్నాయ‌ని [more]

Update: 2019-05-07 07:16 GMT

పోల‌వ‌రం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ… పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో దారుణాలు జ‌రుగుతున్నాయ‌ని అక్క‌డి అధికారులే చెబుతున్నార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు పోల‌వ‌రాన్ని ఒక రాజ‌కీయ అంశంగా చూస్తున్నారు కానీ ఆయ‌న‌కు ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని లేద‌న్నారు. పోల‌వ‌రం విష‌యంలో చంద్ర‌బాబుది ద్వంద్వ వైఖ‌ర‌న్నారు. జూన్ లోగా పోల‌వ‌రం నుంచి నీళ్లు ఇస్తామ‌ని మంత్రి చెప్పార‌ని, నిన్న చంద్ర‌బాబు మాత్రం వ‌చ్చే సంవ‌త్స‌రం వ‌ర‌కు ఇస్తామంటున్నార‌ని, ఎలా ఇస్తారో చెప్పాల‌న్నారు.

ప్రమాదకర పరిస్థితుల్లో….

లెఫ్ట్ కెనాల్ ప‌నులు మాత్ర‌మే పూర్త‌య్యాయ‌ని, రైట్ కెనాల్ ప‌నులు జ‌ర‌గ‌లేద‌న్నారు. పోల‌వ‌రం వ‌ల్ల ప‌గుళ్లు ఏర్ప‌డుతున్నాయ‌ని, ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో పోల‌వ‌రం ప్ర‌మాదం జ‌రుగుతుంద‌న్నారు. వెంట‌నే అక్క‌డ‌కు నిపుణుల‌ను పంపించాల‌ని కోరారు. భ‌విష్య‌త్ లో ఏమైనా తేడా జ‌రిగితే డ్యామ్ కు డ్యామేజ్ ఏర్ప‌డితే రాజ‌మండ్రి మునిగిపోతుంద‌ని అన్నారు. పోల‌వ‌రం క‌ట్ట‌కుండానే సంద‌ర్శ‌న‌ల పేరుతో కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్పాల‌న్నారు.తాను పోల‌వ‌రం వ‌స్తాన‌ని.. అనుమానాల‌ను నివృత్తి చేయాల‌ని కోరారు. త‌న అనుమానాలు త‌ప్ప‌యితే క్ష‌మాప‌ణ చెబుతాన‌ని పేర్కొన్నారు.

Tags:    

Similar News