లాక్ డౌన్ కు సిద్ధంకండి.. ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశం

మహారాష్ట్రలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పాక్షిక లాక్ డౌన్ విధించాలని సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే అధికారులకు సంకేతాలు [more]

Update: 2021-03-29 01:38 GMT

మహారాష్ట్రలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పాక్షిక లాక్ డౌన్ విధించాలని సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే అధికారులకు సంకేతాలు పంపారు. నిన్న రాత్రి నుంచే మహారాష్ట్రలో రాత్రి వేళ కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో లాక్ డౌన్ విధించడమే పరిష్కారమని ఉద్ధవ్ థాక్రే అభిప్రాయపడుతున్నారు. కొద్దిరోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News