బిగ్ బ్రేకింగ్ : ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బాలినేనితో సమావేశం

ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు మంత్రి [more]

Update: 2020-05-26 07:30 GMT

ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు మంత్రి బాలినేనితో భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం జగన్ ను ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసే అవకాశం ఉంది. బాలినేనితో చర్చల తర్వాత వారు విజయవాడ బయలుదేరనున్నారు. ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఉన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న లక్ష్యంతో వైసీపీ ఉంది. మరో ఎమ్మెల్యే కూడా త్వరలోనే జగన్ ను కలుస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News