Ttd : ఆ సంస్థపై టీటీడీ సీరియస్… చర్యలకు సిద్ధం

తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ట్రావెల్ సంస్థపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ సంస్థపై టీటీడీ  చర్యలకు [more]

Update: 2021-09-28 04:18 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ట్రావెల్ సంస్థపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ సంస్థపై టీటీడీ చర్యలకు దిగింది. తిరుమలలో విఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ వాసవి యాత్ర టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రచారం చేసుకుంటుంది. చెన్నైకి చెందిన ఈ సంస్థ 1,11,116 లు చెల్లిస్తే చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరుల నుంచి తిరుమల తీసుకుని వెళ్లి వసతితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని నమ్మబలికింది. తమిళులకు పురటాసి మాసం పవిత్రం. ఈ మాసంలోనే ట్రావెల్స్ సంస్థ భక్తుల దోపిడీకి దిగినట్లు గుర్తించిన టీటీడీ ఆ సంస్థపై చర్యలకు పూనుకుంది. ప్రొటోకాల్ ప్రకారమే వీఐసీ బ్రేక్ దర్శనాలుంటాయని, అసత్యప్రచారాలను నమ్మవద్దని కోరింది.

Tags:    

Similar News