మేము రాజీనామా చేయం: టీటీడీ ఛైర్మన్ పుట్టా

తమను ప్రభుత్వం నియమించిందని, ఇప్పుడు కూడా ప్రభుత్వమే తమ పదవులను రద్దు చేస్తేనే వైదొలుగుతామని, స్వచ్ఛందంగా మాత్రం రాజీనామా చేయమని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ [more]

Update: 2019-05-28 06:54 GMT

తమను ప్రభుత్వం నియమించిందని, ఇప్పుడు కూడా ప్రభుత్వమే తమ పదవులను రద్దు చేస్తేనే వైదొలుగుతామని, స్వచ్ఛందంగా మాత్రం రాజీనామా చేయమని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో టీటీడీ నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. అయితే, తమ పదవీకాలం ఇంకా సంవత్సరం ఉన్నందున తాము రాజీనామా చేయమని టీటీడీ ఛైర్మన్ పుత్తా భీష్మించుకు కూర్చున్నారు. ఇక, ఇవాళ ఆయన టీటీడీ బోర్డు సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుపై టీటీడీ బోర్డు సభ్యుడు చల్లా బాబు విమర్శలు చేయడంతో అధికారులు బోర్డు సమావేశాన్ని బహిష్కరించారు.

Tags:    

Similar News