మోదీ పని వృథానే అన్న ట్రంప్

అఫ్గనిస్తాన్ లో లైబ్రరీకి నిధులు ఇస్తానని నరేంద్ర మోదీ పదే పదే చెప్పారని… అయితే అంతకన్నా వృధా పని మరొకటి ఉండదని తాను చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు [more]

Update: 2019-01-03 08:52 GMT

అఫ్గనిస్తాన్ లో లైబ్రరీకి నిధులు ఇస్తానని నరేంద్ర మోదీ పదే పదే చెప్పారని… అయితే అంతకన్నా వృధా పని మరొకటి ఉండదని తాను చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆయన అమెరికా క్యాబినెట్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావన తీసుకువచ్చారు. అమెరికా కొన్ని దేశాలకు బిలియన్ల కొద్ది డాలర్లను ఖర్చు పెడుతున్నామని, కొందరేమో చిన్న సాయం చేసే అందరి దృష్టినీ ఆకర్షించాలని ప్రయత్నిస్తారని… మోదీని ఉద్దేశించిన అన్నారు. అఫ్గానిస్తాన్ లో లైబ్రరీలకు నిధులు ఇస్తామని మోదీ చెప్పారని… ఆ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ… అక్కడ లైబ్రరీని ఉపయోగించుకునే వాళ్లు ఉంటారా అని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News