చంద్రబాబుపై టీఆర్ఎస్ సంచలన ఆరోపణలు..!

Update: 2018-09-15 10:40 GMT

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొంగలముఠాను రాష్ట్రానికి పంపించారని టీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గట్టు రామచంద్రరావు సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రేదశ్ కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఏబీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణలో క్యాంపు వేశారని ఆరోపించారు. ఈ విషయంపై గవర్నర్, డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వారు స్పందించకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వారిని తరిమేస్తారని హెచ్చరించారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వ కేసు పెడితే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏపీ ప్రజల సొమ్ముతో జీతాలు అందుకుంటున్న ఏపీ పోలీసులు అక్కడి ప్రజల రక్షణ కోసం మాత్రమే పనిచేయాలన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలకు నాలుగైదు జీవిత ఖైదు శిక్షలు వేసినా తక్కువేనని విమర్శించారు.

Similar News