ఎవరికి వారే స్వచ్ఛందంగా లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితి దారుణంగా ఉండటంతో వ్యాపారులు కూడా భయపడి పోతున్నారు. ఎక్కడిక్కడ స్వచ్ఛందంగా లాక్ డౌన్ లు విధించుకంటున్నారు. ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు [more]

Update: 2021-04-29 01:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితి దారుణంగా ఉండటంతో వ్యాపారులు కూడా భయపడి పోతున్నారు. ఎక్కడిక్కడ స్వచ్ఛందంగా లాక్ డౌన్ లు విధించుకంటున్నారు. ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేసినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించుకుంటున్నారు. విజయవాడలో వ్యాపారులు మధ్యాహ్నం 2గంటలకే దుకాణాలను మూసివేస్తున్నారు. ఇక నెల్లూరు, తూర్పుగోదావరి, ప్రకాశం, జిల్లాల్లో వ్యాపారస్థులు తమంతట తామే స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తున్నారు. దీంతో ఏపీ మొత్తం పాక్షిక లాక్ డౌన్ అమలు జరుగుతుందనే చెప్పాలి.

Tags:    

Similar News