లాస్ట్ అప్పీల్

కర్ణాటక రాజకీయం క్లైమాక్స్ కు చేరుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెబల్ ఎమ్మెల్యేలకు లాస్ట్ అప్పీల్ చేశారు. కుమారస్వామి ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. [more]

Update: 2019-07-22 04:10 GMT

కర్ణాటక రాజకీయం క్లైమాక్స్ కు చేరుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెబల్ ఎమ్మెల్యేలకు లాస్ట్ అప్పీల్ చేశారు. కుమారస్వామి ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ ఉచ్చులో పడవద్దని, ఏవైనా సమస్యలుంటే చర్చించుకుందామని లేఖలో కుమారస్వామి తెలిపారు. కాగా ఈరోజు కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కొననున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం తాము సభకు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. బీఎస్పీ ఎమ్మెల్యే సయితం తాను కూడా సభకు హాజరుకాబోనని తెలిపారు. ఆదివారం జరిపిన రాయబారాలు ఫలించలేదు. ఈరోజు బలపరీక్షను స్పీకర్ రమేష్ కుమార్ నిర్వహిస్తారా? లేదా? అన్నది కూడా చర్చగా మారింది.

Tags:    

Similar News