కీలక నిర్ణయం….?

జమ్మూకాశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపట్లో కీలక నిర్ణయం తీసుకుంటుందా? జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయనున్నారా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే జమ్ముకాశ్మీర్ లో [more]

Update: 2019-08-05 04:06 GMT

జమ్మూకాశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపట్లో కీలక నిర్ణయం తీసుకుంటుందా? జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయనున్నారా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే జమ్ముకాశ్మీర్ లో భారీఎత్తున బలగాలను దించారు. స్థానికేతరులందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. కేంద్ర, రాష్ట్ర కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూ, కాశ్మీర్ లను రెండు రాష్ట్రాలుగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేుంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్లమెంటులో ఈరోజే బిల్లు పెట్టే అవకాశముంది. జమ్ము కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి ప్రతిపక్ష నేతలందరినీ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది.

Tags:    

Similar News