బాబు కనుసైగ చేస్తే….?

పాముకు పాలుపోసి పెంచినట్లు బీజేపీ నేతలను పెంచి పోషించామని టీడీపీ ధ్వజమెత్తింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ కు వచ్చిన చంద్రబాబును బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి [more]

Update: 2019-01-04 13:37 GMT

పాముకు పాలుపోసి పెంచినట్లు బీజేపీ నేతలను పెంచి పోషించామని టీడీపీ ధ్వజమెత్తింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ కు వచ్చిన చంద్రబాబును బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీనేత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు పవర్ బ్రోకర్లుగా మారారన్నారు. బాబు కనుసైగ చేస్తే బీజేపీ నేతలు ఇళ్లల్లోనుంచి రారని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం యూసీలు ఇచ్చినట్లు నీతి ఆయోగ్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కానీ అసత్య ప్రచారానికి బీజేపీ నేతలు దిగుతున్నారని ఆయన విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులకు తాము యూసీలు ఇచ్చామని చెప్పారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు ఇచ్చామని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తుందన్నారు. చంద్రబాబుకు దేశంలో, ప్రపంచంలో మంచి పేరు వస్తుందని అక్కసుతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News