17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ టచ్ లోకి

టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పదిహేను నుంచి పదిహేడు మంది వరకూ టీడీపీ ఎమ్మెల్యేలు తమతో మాట్లాడుతున్నారని [more]

Update: 2020-03-12 11:27 GMT

టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పదిహేను నుంచి పదిహేడు మంది వరకూ టీడీపీ ఎమ్మెల్యేలు తమతో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. తాము ఎవరినీ బలవంతంగా పార్టీలోకి రమ్మని కోరడం లేదన్నారు. జగన్ చేపట్టిన అభివృద్ధి పనులను చూసే వారు వైసీపీ వైపు చూస్తున్నారని చెప్పారు. టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేకనే వారంతా తమవైపు చూస్తున్నారని చెప్పారు. అయినా తాము ఏ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడం లేదని చెప్పారు. వారంతట వారే తమకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.

Tags:    

Similar News