టీడీపీలో 17 మందే హాజరయ్యారే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు తొలిరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు పదిహేడు మంది మాత్రమే హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది గెలిచిన [more]

Update: 2019-12-09 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు తొలిరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు పదిహేడు మంది మాత్రమే హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది గెలిచిన సంగతి తెలిసిందే. ఇందులో వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ తాము సభకు హాజరుకాలేకపోతున్నట్లు సమాధానమిచ్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం సమాచారం లేకుండానే గైర్హాజరయ్యారు. ఇది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News