Kakinada : కాకినాడ మేయర్ పదవిపై అవిశ్వాసం.. నేడు ఓటింగ్

కాకినాడ కార్పొరేషన్ మేయర్ పదవి నుంచి టీడీపీ మేయర్ సుంకర పావని తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేయర్ సుంకర పావనిపై అవిశ్వాసంపై నేడు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే [more]

Update: 2021-10-05 03:54 GMT

కాకినాడ కార్పొరేషన్ మేయర్ పదవి నుంచి టీడీపీ మేయర్ సుంకర పావని తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేయర్ సుంకర పావనిపై అవిశ్వాసంపై నేడు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే టీడీపీకి చెందిన 21 మంది కార్పొరేటర్లు మేయర్ కు వ్యతిరేకంగా ఉన్నారు. 2017లో జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడంతో మేయర్ పదవి నుంచి సుంకర పావనిని దించేందుకు కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు జరిగే ఓటింగ్ లో మేయర్ పదవి నుంచి సుంకర పావని తప్పుకునే అవకాశాలే ఉన్నాయి.

Tags:    

Similar News