తాడిపత్రి టీడీపీ ఖాళీ అవుతుందా?

జేసీ దివాకర్ రెడ్డికి పట్టున్న తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ ను ఒంటరిని చేసేందుకు వైసీపీ సిద్ధమయింది. జేసీ బ్రదర్స్ అనుచరులను పెద్దయెత్తున పార్టీలో చేర్చుకుని వారికి [more]

Update: 2019-11-20 06:41 GMT

జేసీ దివాకర్ రెడ్డికి పట్టున్న తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ ను ఒంటరిని చేసేందుకు వైసీపీ సిద్ధమయింది. జేసీ బ్రదర్స్ అనుచరులను పెద్దయెత్తున పార్టీలో చేర్చుకుని వారికి షాకిచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు ప్రధాన అనుచరుడిగా ఉన్న షబ్బీర్ ఆలీతో పాటు దాదాపు 500 మంది వైసీపీ కండువా కప్పేసుకున్నారు. జేసీ బ్రదర్స్ ను మానసికంగా దెబ్బతీసేందుకే ఈ చేరికలు ఉన్నట్లు కన్పిస్తుంది. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ అనుచరులందరినీ పార్టీలో చేర్చుకున్నారు.

Tags:    

Similar News