మోడీ, కేసీఆర్, జగన్ కుమ్మక్కై రీపోలింగ్ తెచ్చారు

నరేంద్ర మోడీ, కేసీఆర్ తో కుమ్మక్కై వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరుపుతున్నారని తెలుగుదేశం [more]

Update: 2019-05-17 08:46 GMT

నరేంద్ర మోడీ, కేసీఆర్ తో కుమ్మక్కై వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరుపుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనూరాధ ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమైందని తెలిసిపోయిందని, అందుకే కుట్ర చేసి రీపోలింగ్ చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, వైసీపీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ కాదని… చెవిరెడ్డి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News