బ్రేకింగ్ : కాసేపట్లో చంద్రబాబు నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్ పదవిని చంద్రబాబునాయుడు ఎవరికి ఇస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే స్పీకర్ [more]

Update: 2019-07-22 05:58 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్ పదవిని చంద్రబాబునాయుడు ఎవరికి ఇస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం వివిధ కమిటీలకు పేర్లను పంపించాలని పార్టీలను కోరింది. ప్రధానంగా పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికే దక్కుతుంది. ఆ పదవికి కేబినెట్ హోదా ఉండటంతో తెలుగుదేశం పార్టీలో దీనికి పోటీ ఏర్పడింది. దీంతో పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News