అమర జవాన్ల కుటుంబానికి తెలంగాణ అండ

పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇవాళ [more]

Update: 2019-02-22 07:09 GMT

పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణాన్ని అన్ని పార్టీలూ ఆమోదించాయి. ఈ సందర్భంగా అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందిస్తుందని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ నిర్ణయాన్ని అన్ని పార్టీలూ స్వాగతించాయి. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించాయి.

Tags:    

Similar News