కారు స్పీడ్ కి బ్రేకులు వేస్తున్న బీజేపీ

తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకునే దిశగా ముందుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి 11 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. అయితే, టీఆర్ఎస్ [more]

Update: 2019-05-23 04:43 GMT

తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకునే దిశగా ముందుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి 11 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. అయితే, టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాలు కచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉంది. టీఆర్ఎస్ స్పీడ్ కి బీజేపీ బ్రేకులు వేసింది. కల్వకుంట్ల కవిత పోటీ చేసిన నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ లో బోయిపనల్లి వినోద్ కుమార్ పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, అదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు ఆధిక్యతలో ఉన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంతో ఉన్నారు.

Tags:    

Similar News