ఎంసెట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎంసెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం [more]

Update: 2020-10-29 13:43 GMT

ఎంసెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. అయితే ప్రభుత్వం మాత్రం పాస్‌ మార్కులతో పరీక్షలు లేకుండానే ఫలితాలు విడుదల చేసింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులను తొలగించాలని కోరారు. పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని జేఎన్టీయూని ఆదేశించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించిన సర్కార్‌ ఎంసెట్‌ నిబంధనలను సవరిస్తూ గురవారం జీవో జారీచేసింది. ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులు తొలగిస్తూ తెలంగాణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించి ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు లబ్ధిపొందనున్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విధంగా విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది.

Tags:    

Similar News