ఎట్టకేలకు కదిలిన ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల వంటి పరిణామాలపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇవాళ ఆయన ప్రగతి భవన్ లో ఇంటర్ ఫలితాల వివాదంపై [more]

Update: 2019-04-24 10:18 GMT

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల వంటి పరిణామాలపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇవాళ ఆయన ప్రగతి భవన్ లో ఇంటర్ ఫలితాల వివాదంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫలితాలపై తలెత్తిన అనుమానాలు, వివాదాలపై వారు ముఖ్యమంత్రికి వివరణ ఇస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేలా ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తప్పులతడకగా ఇంటర్ ఫలితాలు విడుదల చేయడంతో వారం రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు న్యాయం కోసం ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News