ఆమరణ దీక్షకు దిగిన టీడీపీ ఎంపీ

Update: 2018-12-18 08:17 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ లోక్ సభలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటు ఆవరణలో ఆమరణ దీక్షకు దిగారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోడియం వద్ద ఆందోళన చేశారు.

Similar News