విజయం మాదే… విజయోత్సవాలే మిగిలాయి

నరేంద్ర మోడీ, వైఎస్ జగన్ సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆయన మాట్లాడుతూ… [more]

Update: 2019-05-20 06:55 GMT

నరేంద్ర మోడీ, వైఎస్ జగన్ సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆయన మాట్లాడుతూ… మోడీకి వత్తాసు పలికే ఛానళ్లే జగన్ కు కూడా వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని జగన్ కు కూడా తెలుసని చెప్పారు. లగడపాటి రాజగోపాల్ అంచనాలకు మించి తమకు సీట్లు వస్తాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 130 స్థానాలను గెలుచుకొని తిరిగి అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. తమ విజయం ఖాయమని, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందవద్దని, విజయోత్సవాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News