చంద్రబాబు సభలో తముళ్ల లొల్లి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనలో తెలుగు తముళ్ల మధ్య వర్గపోరు భయటపడింది. అధినేత ముందే రెండు వర్గాలుగా చీలిన నేతలు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో [more]

Update: 2019-01-29 12:55 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనలో తెలుగు తముళ్ల మధ్య వర్గపోరు భయటపడింది. అధినేత ముందే రెండు వర్గాలుగా చీలిన నేతలు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. కదిరి నియోజకవర్గంలో చెర్లోపల్లిలో మంగళవారం జరిగిన సభకు చంద్రబాబు హాజరయ్యారు. అయితే, సభలో కదిరి ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్ పాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. చాంద్ పాషా ప్రసంగానికి కందికుంట వర్గీయులు అడ్డుతగిలారు. వచ్చే ఎన్నికల్లో కందికుంటకే టిక్కెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ముఖ్యమంత్ర చంద్రబాబు మాట్లాడుతుండగా కూడా ఇలానే నినాదాలు చేశారు. దీంతో వారి తీరు పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News