సీఎం నివాసం వద్ద కార్యకర్త ఆత్మహత్యాయత్నం

టిక్కెట్ల లొల్లి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుంది. టిక్కెట్లు ఆశిస్తున్నా ఆశావహులు, అసమ్మతివాదులు అనుచరులతో కలిసి వచ్చి చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. [more]

Update: 2019-03-13 10:05 GMT

టిక్కెట్ల లొల్లి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుంది. టిక్కెట్లు ఆశిస్తున్నా ఆశావహులు, అసమ్మతివాదులు అనుచరులతో కలిసి వచ్చి చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. అనంతపురం టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఇవ్వవదని డిమాండ్ చేస్తూ ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను నిలువరించారు. ఇక, పోలవరం టిక్కెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ కు ఇవ్వవద్దని ఒక వర్గం, ఇవ్వాలని ఒక వర్గం బాబు నివాసం వద్ద ఆందోళనకు దిగాయి. ఓ దశలో రెండు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ గొడవ పడ్డారు. దీంతో పోలీసులు వారిని శాంతిపజేశారు.

Tags:    

Similar News