బాబు దీక్ష ప్రారంభం

ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో చంద్రబాబు తన దీక్షను 8గంటలకు ప్రారంభించారు. ఈరోజు రాత్రి 8గంటల వరకూ దీక్ష కొనసాగనుంది. [more]

Update: 2019-11-14 03:04 GMT

ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో చంద్రబాబు తన దీక్షను 8గంటలకు ప్రారంభించారు. ఈరోజు రాత్రి 8గంటల వరకూ దీక్ష కొనసాగనుంది. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసాను పెంచేందుకు చంద్రబాబు దీక్షను చేపట్టారు. పన్నెండు గంటల చంద్రబాబు దీక్షకు జనసేన, సీపీఎం, సీపీఐ మద్దతు పలికాయి. చంద్రబాబు దీక్షలో భవన నిర్మాణ కార్మికులు కూడా పాల్గొన్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరకడం లేదు. దీంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు దీక్షకు దిగారు.

Tags:    

Similar News