అవినీతిపై సీబీఐ విచారణ తప్పదు

తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని, నేరగాళ్లకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నేరగాళ్లకు కొమ్ముకాస్తుడటం వల్లనే [more]

Update: 2021-02-24 02:01 GMT

తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని, నేరగాళ్లకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నేరగాళ్లకు కొమ్ముకాస్తుడటం వల్లనే వాళ్లు స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతుందని తరుణ్ చుగ్ తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాక్షస పాలన నుంచి భారతీయ జనతా పార్టీ విముక్తి కల్పిస్తుందని తరుణ్ చుగ్ తెలిపారు. టీఆర్ఎస్ అవినీతిపై ఖచ్చితంగా సీబీఐ విచారణ కోరుతామని, దోషులను శిక్షించేలా చర్యలు తీసుకుంటామని తరుణ్ చుగ్ తెలిపారు.

Tags:    

Similar News