బ్రేకింగ్ : తాడిపత్రిలో టీడీపీకి షాక్… ఆ ఓటు హక్కు చెల్లదు

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే టీడీపీకి షాక్ తగిలింది. నలుగురు ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాము మున్సిపల్ [more]

Update: 2021-03-15 07:02 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే టీడీపీకి షాక్ తగిలింది. నలుగురు ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాము మున్సిపల్ ఛైర్మన్ ఓటింగ్ లో పాల్గొంటామని శవారు తెలిపారు. ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, శమంతకమణి, గోపాల్ రెడ్డి, దీపక్ రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నలుగురి ఎమ్మెల్సీల దరఖాస్తును తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ తిరస్కరించారు. దీపక్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. తాడిపత్రిలో ఓటుహక్కు ఉంటేనే ఎక్స్ అఫిషియో సభ్యులుగా చేరేందుకు వీలవుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా చేరే అవకాశముంటుందని మున్సిపల్ కమిషనర్ చెప్పారు.

Tags:    

Similar News