చంద్రబాబుపై వివేకానందరెడ్డి కూతురు ఫిర్యాదు

తన తండ్రి హత్య కేసును తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీతారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఎన్నికల సంఘం [more]

Update: 2019-03-21 09:00 GMT

తన తండ్రి హత్య కేసును తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీతారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. తన తండ్రి హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు కుట్ర జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు సిట్ విచారణను తప్పుదోవపట్టించేలా, ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులకు శిక్షపడేలా చూడాలని ఆమె వినవించారు. చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా వివేకానందరెడ్డి హత్యను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్న సంగతి తెలిసిందే. వివేకానందరెడ్డిని కుటుంబసభ్యులే హత్య చేశారనే విధంగా చంద్రబాబు ప్రతీరోజూ ప్రచారం చేస్తున్నారు.

Tags:    

Similar News