అమరావతి విషయంలో సరైైన సమయంలో జోక్యం

రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాద దాటుతున్నా పోలవరం, అమరావతి [more]

Update: 2020-07-30 12:58 GMT

రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాద దాటుతున్నా పోలవరం, అమరావతి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదన్నారు. అధికార వికేంద్రీకరణ అంటే రాజధాని తరలించడం వల్ల జరగదని సుజనా చౌదరి తెలిపారు. ప్రభుత్వం మారినప్పుడల్లా నిర్ణయాలు మారుస్తామంటే కుదరదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో రాజధాని అమరావతి విషయంలో జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి తెలిపారు. కోర్టులు మొట్టికాయలు వేయడం ప్రభుత్వానికి నామోషీ అని సుజనా చౌదరి అన్నారు. మండలి అనుమతి లేకుండా బిల్లులను గవర్నర్ కు పంపండం తప్పు అని సుజనా చౌదరి పేర్కొన్నారు.

Tags:    

Similar News