విశాఖ కాదు… విజయవాడలోనే

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో తొలుత నిర్వహించాలని భావించింది. అయితే మూడు రాజధానుల అంశం హైకోర్టులో [more]

Update: 2020-08-07 01:34 GMT

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో తొలుత నిర్వహించాలని భావించింది. అయితే మూడు రాజధానుల అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో విజయవాడలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు.

Tags:    

Similar News