ముఖ్యమంత్రి నోట సట్టా మార్కెట్ మాటనా..?

ముంబై బెట్టింగ్ మాఫియాపై చంద్రబాబుకు ఉన్న నమ్మకం, ఓట్లేసిన ప్రజలపై లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో [more]

Update: 2019-05-03 07:14 GMT

ముంబై బెట్టింగ్ మాఫియాపై చంద్రబాబుకు ఉన్న నమ్మకం, ఓట్లేసిన ప్రజలపై లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతున్నట్లు ఉన్న ఓ ఆడియోను శ్రీకాంత్ రెడ్డి వినిపించారు. టీడీపీ గెలుస్తుందని ముంబైలో బెట్టింగ్ మాఫియా నడిచే సట్టా మార్కెట్ లో సైతం బూకీలు చెబుతున్నారని చంద్రబాబు అంటున్నట్లుగా ఆ ఆడియో ఉంది. ఈ ఆడియో శ్రీకాంత్ రెడ్డి మీడియా ముందు వినిపించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బెట్టింగ్ మాఫియా నడిచే సట్టా మార్కెట్ గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబుపై వెంటనే కేసు పెట్టాలని పేర్కొన్నారు. చేయని నేరానికి వైసీపీ ఎమ్మెల్యేలను క్రికెట్ బెట్టింగ్ కేసులో చంద్రబాబు ఇరికించారని గుర్తు చేశారు. కేవలం ఓడిపోయాక పార్టీలో తిరుగుబాటు జరగకుండా చంద్రబాబు ఓటమికి ఈవీఎంలపై నేపం నెట్టేసేందుకు ఇటువంటి ఇల్లీగల్ మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News