బాబాయ్ అరెస్ట్ పై రామ్మోహన్ నాయుడు

అచ్చెన్నాయుడు అరెస్ట్ పై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రతిపక్ష నేతగా ప్రజల తరుపున మాట్లాడటం అచ్చెన్నాయుడు చేసిన తప్పా? అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. [more]

Update: 2020-06-12 07:07 GMT

అచ్చెన్నాయుడు అరెస్ట్ పై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రతిపక్ష నేతగా ప్రజల తరుపున మాట్లాడటం అచ్చెన్నాయుడు చేసిన తప్పా? అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. అచ్చెన్న ఒక్కడినే ఎదుర్కొనే ధైర్యం లేకనే అక్రమ అరెస్ట్ లకు ప్రభుత్వం పాల్పడిందన్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసింది 151 మంది వైసీపీ గూండాలని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చసే పద్ధతి ఇదేనా? అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. తమ కుటుంబానికి అవినీతి మచ్చ లేదని, అరెస్ట్ లతో బలమైన గొంతుకలను అణిచివేద్దామనుకుంటే కుదరదని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News