మరిన్ని పెరుగుతాయట… అప్రమత్తంగా ఉండాల్సిందే?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడ లేదు. లాక్ డౌన్ మినహాయింపులతో కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]

Update: 2020-06-06 02:07 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడ లేదు. లాక్ డౌన్ మినహాయింపులతో కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది ఒక్కరోజే చనిపోయారు. దీంతో తెలంగాణాలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 113కు చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదయిన 143 కేసుల్లో 116 కేసులు హైదరాబాద్ లోనివే. దీంతో తెలంగాణాలో మొత్తం కేసుల సంఖ్య 3,290కు చేరుకుంది. ఇప్పటివరకూ నమోదయిన కేసుల్లో 2,842 మంది తెలంగాణకు చెందిన వారు. మిగలిన వారు విదేశాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులే కావడం గమనార్హం. రానున్న రోజుల్లో తెలంగాణలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News