ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా… తగ్గని మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 8,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 86 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2020-08-24 13:37 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 8,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 86 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,58,817కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 3,368 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 89,516 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 2,68,828గా ఉంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 33 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News