వారంలోపే సిట్ నివేదిక… అసలు దోషులెవరో?

విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు ముగిసింది. మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. విశాఖలో పెద్దయెత్తున భూ ఆక్రమణాలు జరిగాయని ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ [more]

Update: 2020-12-09 02:26 GMT

విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు ముగిసింది. మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. విశాఖలో పెద్దయెత్తున భూ ఆక్రమణాలు జరిగాయని ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై దర్యాప్తు చేసిన సిట్ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సిట్ అధికారి విజయకుమార్ తెలిపారు. దీంతో విశాఖ భూ ఆక్రమణల్లో ఎవరి పేరు ఉండదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధుల పేర్లు సిట్ నివేదికలో ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News