ఏమిటీ ఆంక్షలు జగన్?

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఇంట్లోనే వినాయక చవితి జరుపుకోవాలంటూ ముఖ్యమంత్రి చెప్పడాన్ని సోము [more]

Update: 2021-09-05 06:37 GMT

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఇంట్లోనే వినాయక చవితి జరుపుకోవాలంటూ ముఖ్యమంత్రి చెప్పడాన్ని సోము వీర్రాజు తప్పుపట్టారు. చవితి పండగ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి అనుమతి అవసరమా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇతర మతల పండుగలకు ఒకలా, హిందువుల పండగ మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని సోము వీర్రాజు అన్నారు. వినాయక చవితిపై ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సోము వీర్రాజు కోరారు.

Tags:    

Similar News