ఆంధ్రాప్రజలు ఇంకా శత్రువులేనా?

తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర ప్రజలను శత్రువులుగా చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో [more]

Update: 2021-06-23 07:27 GMT

తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర ప్రజలను శత్రువులుగా చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రులుగా తెలంగాణ నేతలే ఉండేవారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు ఏపీని తాకట్టుపెట్టారని, ఏపీ నష్టపోయిందని సోము వీర్రాజు అన్నారు. కృష్ణా, గోదావరి నీటి విషయంలో తెలంగాణ వాళ్లే తరచూ అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. పోలవరం ముంపు మండలాల కోసం బీజేపీ పోరాటం చేసిన విషయాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు.

Tags:    

Similar News