ఏపీ డీజీపీపై సోము ఫైర్

ఆలయాలపై జరుగుతున్న దాడుల్లో బీజేపీ ప్రమేయం ఉందని డీజీపీ ప్రకటించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండి పడ్డారు. డీజీపీని వెంటనే ప్రభుత్వం పదవి నుంచి [more]

Update: 2021-01-17 06:04 GMT

ఆలయాలపై జరుగుతున్న దాడుల్లో బీజేపీ ప్రమేయం ఉందని డీజీపీ ప్రకటించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండి పడ్డారు. డీజీపీని వెంటనే ప్రభుత్వం పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా డీజీపీ మాట్లాడుతున్నారని సోము వీర్రాజు అన్నారు. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో డీజీపీకి తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. తమపై నిరాధారమైన ఆరోపణలు మానుకుని అసలు నిందితులను పట్టుకోవాలని సోము వీర్రాజు కోరారు. కేసులను తప్పు దారి పట్టించేందుకే డీజీపీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు.

Tags:    

Similar News