వారందరికీ ఎక్స్ గ్రేషియో ఇవ్వాల్సిందే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు. కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన తన లేఖలో [more]

Update: 2021-05-05 01:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు. కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన తన లేఖలో కోరారు. వైఎస్సార్ బీమా లేదా ఎక్స్ గ్రేషియో ద్వారా ఆదుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా పదిహేను వేల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో పేదలకు సాయం అందడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు సరైన వైద్యం కల్పించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన లేఖలో జగన్ ను కోరారు.

Tags:    

Similar News