సోమారపు వివాదాన్ని అలా ముగించారు...

Update: 2018-07-10 14:28 GMT

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణను శాంతింపజేసేందుకు టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లక్ష్మీనారాయణపై స్వంత పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టడం, ఎమ్మెల్యేగా ఉన్నా సోమారపు వారిని కట్టడి చేయకపోవడంతో టీఆర్ఎస్ అధిష్ఠానం ఆయనపై సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి.

కేటీఆర్ చొరవ తీసుకోవడంతో...

ఈ నేపథ్యంలో నొచ్చుకున్న సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు నిన్న రామగుండంలో సింగరేణి కార్మికుల గేట్ మీటింగ్ లో ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో మంత్రి కేటీఆర్ వెంటనే రంగప్రవేశం చేశారు. సోమారపు సత్యనారాయణతో సమావేశమై చర్చించారు. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేశారు. ఈ మేరకు ఇద్దరు కలిసి తెలంగాణ భవన్ రాగా, అందరి సమక్షంలో తన నిర్ణయాన్ని విరమించుకుంటున్నానని, రాజకీయాల్లో కొనసాగుతానని సోమారపు ప్రకటించారు. దీంతో ఈ అంశానికి ముగింపు పలికినట్లయింది.

Similar News