బ్రేకింగ్ : వారికి సిద్ధూ గుడ్ న్యూస్

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం దృష్ట్యా కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈనెల 21వ [more]

Update: 2019-07-09 06:47 GMT

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం దృష్ట్యా కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈనెల 21వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. అసమ్మతి నేతలందరూ తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారని సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. రామలింగారెడ్డి తో సహా అందరూ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారన్నారు. అసమ్మతి నేతలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు ఇప్పటికే మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసమ్మతి కాంగ్రెస్ నేతలకు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సిద్దరామయ్య వల వేశారు. సంకీర్ణ సర్కార్ కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు.

Tags:    

Similar News